రేపు పార్లమెంటు భవనంలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో ఎన్డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు, విపక్ష ‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్రెడ్డికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడవుతుంది.గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ, ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతాయేమోనన్న ఆందోళన రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోవడంతో ఈసారి పార్టీలు మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ తమ ఎంపీల కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యాహ్నం మాక్ పోలింగ్ ద్వారా తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పిస్తోంది. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా, ‘ఇండియా’ కూటమికి 311 మంది సభ్యులున్నారు. వైసీపీ ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. బీజేడీ మద్దతు కోసం ప్రధాని మోదీ ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్తో స్వయంగా మాట్లాడారు. బీఆర్ఎస్ తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa