ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 03:08 PM

ఈ నెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. "రాజీమార్గమే రాజమార్గం. కక్షలతో ఎటువంటి లాభం ఉండదని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని" ఆయన అన్నారు. రాజీ పడితే ఇరువురూ గెలుస్తారని, కొట్టుకుంటే ఒకరే గెలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa