ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న తెలుగు వ్యక్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి మద్దతు కూడగట్టేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అయితే, తెలుగు ఆత్మగౌరవం నినాదంతో ఆయన చేసిన విజ్ఞప్తికి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన పార్టీల నుంచి మద్దతు లభించలేదు.ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్కు ముందు, మంగళవారం ఉదయం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు వేసే ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రే ఢిల్లీ చేరుకున్న రేవంత్, ఇండియా కూటమిలో లేని పార్టీల ఎంపీలను సంప్రదించి, సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని కోరినట్లు సమాచారం.గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని గుర్తుచేస్తూ, తెలుగు వ్యక్తికి దక్కుతున్న ఉన్నత పదవికి పార్టీలకు అతీతంగా మద్దతివ్వాలని రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, వెంకయ్యనాయుడు వంటి వారికి తెలుగువారంతా ఏకతాటిపై నిలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa