ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలాపూర్ హుండీకి భారీగా ఆదాయం.. 11 రోజుల్లో ఇన్ని లక్షలా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 07:55 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గణపయ్యను పూజించి.. గంగమ్మ ఒడికి చేర్చారు. ఇక వినాయక చవితి ఉత్సవాలు అనగానే.. అందరికి గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణపతి. బడా గణేష్‌ని చూడటానికి లక్షలాది మంది జనాలు తరలి వస్తారు. ఇక హైదరాబాద్‌లో వినాయక చవితి అనగానే లడ్డూ వేలం పాట గుర్తుకు వస్తుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాటకి చాలా క్రేజ్ ఉంటుంది. బాలాపూర్ లడ్డూని దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. ఈసారి కూడా లడ్డూ వేలం పాటలో చాలా మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ 35 లక్షల రూపాయలు పలికింది..


నగరంలో ఖైరతాబాద్ వినాయకుడితో పాటు బాలాపూర్ గణపయ్యని దర్శించుకునేందుకు కూడా చాలా మంది తరలి వస్తుంటారు. అలా వచ్చిన భక్తులు వినాయకుడి హుండీలో భారీ స్థాయిలో డబ్బులను కానుకగా వేశారు. నిమజ్జనం, లడ్డూ వేలం పాట వంటి కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులు బాలాపూర్ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈసారి బాలాపూర్ వినాయకుడికి భారీ ఆదాయం వచ్చిందని తెలిపారు.


 ఈ సంవత్సరం బాలాపూర్ గణేశుడి హుండీకి రూ. 23,13,760 ఆదాయం వచ్చినట్లుగా ఉత్సవ కమిటీ చైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పోయిన ఏడాది బాలాపూర్ గణేశుడి హుండీలో భక్తులు సమర్పించిన మొత్త రూ.18 లక్షల రూపాయలు కాగా ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది బాలాపూర్ హుడీ ఆదాయం రూ.5 లక్షలు పెరిగి.. 23 లక్షల రూపాయలకు పైగా వచ్చిందని ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారు. బాలాపూర్ గణేషుడికి ఇంత భారీ ఆదాయం రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ కూడా భారీ ధర పలికింది. రూ. 35 లక్షల రూపాయలు పలికింది. హైదరాబాద్ కర్మాన్‌ఘాట్‌లో ఉండే లింగాల దశరథ్ గౌడ్ ఈ సారి బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈసారి బాలాపూర్ లడ్డూ దాదాపుగా 5 లక్షలు ఎక్కువ ధర పలకడం గమనార్హం. వేలం అనంతరం లింగాల దశరథ గౌడ్‌.. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు. లడ్డూ వేలం పాట రూ. 1,116తో ప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగుతూ చివరకు రూ.35 లక్షల వద్ద ఆగింది. ఈసారి లడ్డూ వేలం పాటలో మెుత్తం 38 మంది పాల్గొన్నారు. గతంలో లడ్డూ దక్కించుకున్న 31 మందితో పాటుగా.. ఈ సంవత్సంర కొత్తగా మరో 7 మంది వేలంలో పోటీపడ్డారు. చివరకు దశరథ్ గౌడ్ లడ్డూ దక్కించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa