అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద కాలువల్లో పూడిక తీసే పనులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారుమంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇటీవల భారీ వర్షాలకు మెట్రో స్టేషన్ పరిసరాలు నీట మునిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంతాలను పరిశీలించడం.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలన్నీ వరద ముంచెత్తడానికి కారణాలపై అధ్యయనం చేశాయి. మెట్రో స్టేషన్ కింద ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ లైన్లు కొన్ని పూర్తిగా బ్లాక్ అవ్వడం.. మరి కొన్ని పాక్షికంగా మూసుకుపోవడాన్నిగమనించారు. వెంటనే పూడిక తీత పనులను చేపట్టారు. పై నుంచి వచ్చే కాలువల్లో పేరుకుపోయిన పూడికను హైడ్రా, జీహెచ్ ఎంసీ సంయుక్తాధ్వర్యంలో తొలగించాయి. ప్రధాన రహదారి కింద ఉన్న బాక్సు డ్రైన్లలో పూడికను తొలగించడానికి రోబోటెక్నాలజీని వాడాల్సిన అవసరాన్ని అధికారులు ఈ సందర్భంగా కమిషనర్కు వివరించారు. రోబో టెక్నాలజీతో గట్టిగా మారిన పూడికను సొరంగ మార్గాల్లో మట్టి తీసిన మాదిరి తొలగించి ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేయవచ్చునన్నారు. రోబో టెక్నాలజీతో పూడికను తొలగించే విధానాన్నికమిషనర్కు వివరించారు. ప్రధాన రహదారి కింద ఉన్న బాక్సు డ్రైన్లు తెరచుకుంటే చాలావరకు వరద సమస్యను పరిష్కరించవచ్చునని.. రోబో టెక్నాలజీతో నాలుగైదు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు కమిషనర్కు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa