ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిష్ఠాత్మక 'గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025'కు ఎంపిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 08:39 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. పర్యావరణ పరిరక్షణకు కేటీఆర్ కృషి చేశారంటూ, ఆయనను 'గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025'కు ఎంపిక చేశారు.ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా జరగనుంది. ఈ నెల సెప్టెంబర్ 24వ తేదీన అక్కడ నిర్వహించనున్న 9వ 'ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్' వేదికగా కేటీఆర్‌కు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, హరిత విధానాల అమలులో కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చొరవ చూపారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పురస్కారం కేటీఆర్‌కు వ్యక్తిగతంగానే కాకుండా, తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు జరిగిన ప్రయత్నాలకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa