తెలంగాణలో రేవంత్ సర్కార్.. నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తోంది. అలానే ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వకుండా.. జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు రావడంతో.. టీచర్ల హాజరు నమోదుకు ఫేసియల్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అలానే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థులకు కూడా ఫేసియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు..
రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. వీరి హాజరుకు సంబంధించి సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో డుమ్మా చదువులుకు చెక్ పడనుంది. ఇంతకు నూతన హాజరు విధానం ఏంటి అంటే.. త్వరలోనే డిగ్రీ, పీజీ అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలు చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విద్యాశాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల హాజరుకు సంబంధించి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం ఆదేశాల అమలుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది.
ఈక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్.. శుక్రవారం నాడు కౌన్సిల్ ఆఫీసులో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లో ప్రధానంగా విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం హాజరు అమలు చేయాలనే అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్కారు పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నారు. త్వరలోనే ఈ విద్యార్థులందరికి కూడా ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం అమలు చేయనున్నారు.
ప్రస్తుతం తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల హాజరుకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం విధానం అమలవుతోంది.దీనికోసం ప్రభుత్వం ఏఐ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్ను డిజైన్ చేయించింది. ఈ యాప్లో ఒకసారి విద్యార్థుల కన్ను, కనురెప్ప, ముక్కు వంటి 70 ఫేషియల్ పాయింట్లను నమోదు చేస్తారు. ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయుడు తమ స్మార్ట్ఫోన్లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపితే చాలు హాజరు నమోదవుతుంది. ఒకేసారి తరగతి గదిలోని 15-20 మంది హాజరు కూడా తీసుకోవచ్చు. ఒకటో తరగతిలో విద్యార్థి ఫేషియల్ పాయింట్లు తీసుకుంటే డిగ్రీ చదివే వరకు పనిచేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa