రాష్ట్రంలోని కీలకమైన గాంధీ ఆసుపత్రిలో పాలనాపరంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న డాక్టర్ రాజకుమారిని ఆ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో వైద్య విద్య అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ వాణికి సూపరింటెండెంట్గా అదనపు బాధ్యతలను అప్పగించింది.గత కొంతకాలంగా డాక్టర్ రాజకుమారి పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆమె వైఫల్యం చెందారంటూ పలువురు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, ఆమెపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిపాలనను గాడిన పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్లు స్పష్టమవుతోంది. డాక్టర్ వాణికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa