యూరియా కోసం అన్నదాతల బేధన
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో శనివారం ఉదయం యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు సొసైటీకి చేరుకున్నారు. వ్యవసాయ పనులు పూర్తి చేయాలంటే యూరియా అత్యవసరం కావడంతో రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. కానీ అందుబాటులో ఉన్న యూరియా పరిమితంగా ఉండటంతో రైతులలో నిరాశ వ్యాప్తి చెందింది.
సరఫరాలో తీవ్ర లోపాలు
బీబీపేట మండలంలో యూరియాకు విపరీతమైన డిమాండ్ ఉన్నా కూడా కేవలం 600 బస్తాలు మాత్రమే ప్రభుత్వం పంపించింది. ఇది అందరికి సరిపడే విధంగా కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు ప్రణాళిక లేకపోవడమే రైతుల ఇబ్బందులకు కారణమవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులను పోలీస్ స్టేషన్కు తరలింపు
సొసైటీ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యూరియా కోసం వచ్చిన కొంతమంది రైతులను పోలీస్ స్టేషన్కు తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా తమ సమస్య చెప్పుకుంటే ఈ తరహా చర్యలు తీసుకోవడం దారుణమని రైతులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్
యూరియా సరఫరాలో ఏర్పడుతున్న లోపాలను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి రైతుకు సరిపడా యూరియా అందేలా సమర్థవంతమైన వ్యూహాన్ని అమలు చేయాలనీ, లేకపోతే ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతాయన్న హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa