శంషాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో మరో దొంగతనం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగలు చొరబడి భారీ చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అవకాశంగా మార్చుకుని దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు.
వివరాల్లోకి వెళితే, దొంగలు ఇంట్లో నుండి సుమారు 47 తులాల బంగారు ఆభరణాలు, రూ. 11,000 నగదు, అలాగే ఖరీదైన విదేశీ వాచీలు అపహరించినట్లు సమాచారం. ఇంట్లో అమర్చిన లోకర్లు, అల్మారీలను బలవంతంగా తెరిచి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ను రప్పించి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆధారాల కోసం ఫింగర్ ప్రింట్స్తో పాటు ఇతర సాంకేతిక విధానాలను కూడా ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇప్పటికే అనుమానితుల జాబితాను సిద్ధం చేసి, వారి మీద నిఘా ఉంచినట్టు సమాచారం. శంషాబాద్ ప్రాంతంలో వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుని చోరీకు తెరదించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa