HYDRA : అల్వాల్ మండలంలోని కౌకూరు ప్రాంతం భారీ వరద ముప్పు నుంచి బయటపడింది. కౌకూరుకుంట-నాగిరెడ్డికుంట మధ్య అనుసంధాన కాలువను హైడ్రా అధికారులు పునరుద్ధరించడం దీని ప్రధాన కారణంగా నిలిచింది.కాలువపై అనుమతి లేకుండా నిర్మించిన గోడపై స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో, హైడ్రా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో గోడ నిర్మాణం అక్రమమని నిర్ధారించడంతో వెంటనే కూల్చివేత చర్యలు ప్రారంభించారు.ఈ గోడ తొలగించబడిన వెంటనే కౌకూరుకుంట నుంచి నాగిరెడ్డికుంటకు నీటి ప్రవాహం స్వేచ్ఛగా సాగిపోయింది. దీంతో వరద నీరు నిలకడగా పారిపోవడంతో, ఫార్చ్యూన్ టవర్స్, కౌకూరు గ్రామ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కానీ హైడ్రా చర్యల వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది.హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ స్థానికులు నినాదాలు చేయడంతో పాటు, "Hydra Long Live" అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు హైడ్రా తీసుకున్న చర్యలు వారికి భద్రత కలిగించడమే కాక, సంస్థపై నమ్మకాన్ని మరింత పెంచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa