రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఒక ప్రకటనలో మహిళలు, ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్లలో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, దుర్గామాత అమ్మవారిని ఏర్పాటు చేసిన ప్రాంతాలలో పోలీసులు నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని, పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా, పర్యవేక్షణతోపాటు ప్రజల భద్రతను తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa