అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం భారీగా కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెద్ద అంబర్పేట వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది.
తీవ్ర వర్షానికి రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా ఖైరతాబాద్-రాజ్భవన్ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాహనాలు నీటిలో మొరాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఆఫీస్ టైమ్లో వర్షం కురవడంతో ప్రయాణికులు బారిన పడ్డారు. పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోయింది.
వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నీటి నిష్క్రమణకు డ్రైనేజీ లైన్లను శుభ్రం చేయడంతో పాటు, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసుల సహకారంతో చర్యలు చేపట్టారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa