భారత విద్యావ్యవస్థలో మరిన్ని మంచి మార్పులు త్వరలో రాబోతున్నాయి. దండగమారి చదువులంటూ వస్తున్న విమర్శల్ని, ఉద్యోగాలకు తగిన నైపుణ్యం కల్గిన అభ్యర్థులు దొరకడంలేదన్న అసంతృప్తుల్ని తిప్పికొట్టేలా నిర్మాణాత్మక చర్యలు జరుగబోతున్నాయి. త్వరలో 11-12వ తరగతుల పాఠ్యాంశాల్లో నైపుణ్య ఆధారిత (స్కిల్-బేస్డ్) లెర్నింగ్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు.. ఉద్యోగాలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను అందించాలని, దేశ వృద్ధికి దోహదపడే మానవ వనరులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, రాష్ట్రీయ విద్యా భవన్ ద్వారా 11వ, 12వ తరగతుల సిలబస్లో స్కిల్ ఆధారిత మాడ్యూల్స్ను చేర్చనున్నారు. ఇందులో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 'విద్యార్థులు పుస్తకాలతో మాత్రమే పరిమితం కాకుండా, రియల్-వరల్డ్ స్కిల్స్తో సిద్ధమవ్వాలి.. ఇది భారత్ను గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చుతుంది' అని కేంద్ర విద్యా, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa