హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 30 సంవత్సరాల మహిళను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి గురిచేసి, అనంతరం హత్య చేసిన ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనలో మూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు కేసు మరింత లోతుగా అన్వేషిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు అత్తాపూర్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ప్రధాన నిందితుడు ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆపై తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆమెను కిస్మత్పురలోని నిర్మాణంలో ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఘటన అనంతరం బాధితురాలిని హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పడేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీలు, ఫోన్ లొకేషన్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు దుర్గారెడ్డితో పాటు మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఉన్నారు.
ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ హద్దులో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళల భద్రతపై నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో తీసుకెళ్లే యోచనలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa