సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ హైదరాబాదులోని చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుష్బూ గౌరమ్మకు కుంకుమ పూజ నిర్వహించారు.తెలంగాణ మహిళలందరికీ ఆమె బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బతుకమ్మ వేడుకలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకను తిలకించేందుకు, ఆడటానికి పెద్ద సంఖ్యలోమహిళలు తరలివచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa