ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:00 PM

నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలని ఆయన సూచించారు.స్థానిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కార్యకర్తగా 40 ఏళ్లుగా బీజేపీలో కొనసాగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa