శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలోని పలు శ్రీ దుర్గామాత మండపాలను బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ సందర్శించి,అమ్మవారిని దర్శించుకున్నారు. పటాన్చెరు పట్టణంలోని శాంతినగర్, గినెమ్మబస్తీ, గోకుల్ నగర్, గౌతమ్ నగర్, జేపీ కాలనీ మరియు ఇస్నాపూర్ ప్రాంతాల్లోని శ్రీ దుర్గామాత మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలు పొందిన మాదిరి ప్రిథ్వీరాజ్ గారు.ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమాజంలో ఐక్యత, సద్భావన పెరిగి ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి నిండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఈ ఉత్సవం ప్రతి ఒక్కరి హృదయాలను కలిపే, సాంఘిక ఐక్యతను పెంపొందించే అవకాశంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.ఈ ఉత్సవాలు పటాన్చెరు మరియు సమీప గ్రామాల్లో సామూహిక సంతృప్తి, భక్తి ఉత్సాహాన్ని పెంపొందిస్తూ, స్థానికుల్లో సాంప్రదాయ పరిరక్షణ పట్ల మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa