ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 05:47 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, పలు కీలక రాజకీయ అంశాలపై స్పందించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచారు" అని ఆయన ఆరోపించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ అంతర్గత విషయాలపైనా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఈ విషయంపై అధిష్ఠానమే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డీసీసీల ఏర్పాటుపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సమావేశం జరగనుందని వెల్లడించారు. ఈ భేటీకి ఏఐసీసీ కొత్తగా నియమించిన 22 మంది పరిశీలకులు కూడా హాజరవుతారని చెప్పారు. ఈ పరిశీలకుల బృందం అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తుందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa