ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ విద్యలో మార్పులకు తెలంగాణ బోర్డు శ్రీకారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 05:53 PM

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. భవిష్యత్ టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, వచ్చే నవంబర్ నెల నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై తరగతులు ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. ఆధునిక సాంకేతిక విద్యను పాఠశాల స్థాయి నుంచే అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌తో పాటు పరీక్షల విధానంలో కూడా మార్పులు చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులపై భారం తగ్గించి, నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల పట్ల విద్యార్థుల ఆదరణ పెరుగుతోందని, గతేడాదితో పోలిస్తే ఈసారి అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa