ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై ఏ సినిమా టికెట్ ధరలను పెంచేది లేదు: మంత్రి కోమటిరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 06:24 PM

ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచడాన్ని సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కొత్త సినిమాల టికెట్ల ధరలను పెంచడాన్ని సస్పెండ్ చేసింది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సినిమా టికెట్ ధరలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇకపై ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరలను పెంచుకునేలా అనుమతులు ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa