ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాకు ఎల్లో అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 07:10 PM

సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు మాట్లాడుతూ, రానున్న 48 గంటల్లో భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని సూచించారు. వాగులు, వంకలను చూడటానికి వెళ్లడం, దాటడానికి ప్రయత్నించడం చేయరాదని, రైతులు విద్యుత్ మోటార్ల వద్ద, విద్యుత్ స్తంభాలు, వైర్ల వద్ద జాగ్రత్త వహించాలని, పాడైన భవనాల వద్ద నివాసం ఉండరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa