తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొని, బాధితులకు అండగా నిలవాలని తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, హైదరాబాద్లో మూసీ నదికి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) సహా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వరద బాధితులకు మనోధైర్యం కల్పించడం అత్యవసరమని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa