ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమసంభంధంతో బిడ్డకి తల్లైన యువతి, బిడ్డను అడవిలో వదిలేసిన వైనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 02:23 PM

పందొమ్మిది రోజుల పసికందు పట్ల కన్నతల్లే కసాయిగా ప్రవర్తించింది. బిడ్డను అడవిలో వదిలేసి వెళ్లింది. ఆకలితో బిడ్డ ఏడిస్తే ఎవరైనా గుర్తిస్తారనే భయంతో ఆ పసికందు పెదాలను గ్లూతో అతికించింది. అక్రమ సంబంధం వల్ల పుట్టడమే ఆ పసికందు చేసిన పాపం.. తండ్రితో కలిసి తల్లి ఈ దారుణానికి పాల్పడింది. రాజస్థాన్ లోని బిల్వారాలో జరిగిన ఈ ఘటన వివరాలు..బిల్వారా అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఓ పసికందును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రోజుల పసిగుడ్డు పరిస్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. పెదాలను గ్లూతో అతికించడంతో ఏడిచేందుకూ వీలులేని పరిస్థితిలో ఉన్న ఆ పసికందును వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. అనంతరం దర్యప్తు చేపట్టి పాప తల్లిని, తాతను అదుపులోకి తీసుకుని విచారించగా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. మహిళ అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చడంతో ఆమె తండ్రి బుండిలో మారుపేరుతో ఓ గది అద్దెకు తీసుకుని అందులో ఉంచాడు. కాన్పు అయ్యాక పసికందును అమ్మే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో బిడ్డను తీసుకుని బుల్వారా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. బిడ్డ ఏడుపు ఎవరికీ వినిపించకుండా ఉండాలని పెదాలను గ్లూతో అతికించారు. అక్రమ సంబంధం వల్ల గర్బం దాల్చడంతో ఆ విషయం బయటపడితే కుటుంబానికి చెడ్డపేరు వస్తుందనే కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆ తండ్రీకూతుళ్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పసికందు కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa