ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 03:19 PM

గోషామహల్‌లో సొంత ఇల్లు లేదన్న మనోవేదనతో జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న రాకేశ్‌ (36) శుక్రవారం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన రాకేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోడేఖీఖబర్‌లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందినట్లు తెలిపారు. భార్య లావణ్య ఫిర్యాదుతో గోషామహల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa