ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు రేవంత్ రెడ్డి వార్నింగ్: తల్లిదండ్రుల పరిరక్షణ లేని వారికి జీతం తగ్గింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 10:09 PM

హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 విజయదారులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆరు దశాబ్ధాలుగా సాగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు.తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి, ఇషాన్ రెడ్డి వంటి నాయకులను ఆయన స్మరించారు.రాష్ట్రాన్ని ఒక కుటుంబం, ఒక పార్టీ సొంతంగా భావించే రోజులూ ముగిశాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పదేళ్లుగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించకపోయిన పూర్వ ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేశారు. నియామకాల విషయంలో పారదర్శకత లేకుండా ఐదు కోట్లు తీసుకుని ఉద్యోగాలు విక్రయించారని కూడా ఆయన ఆరోపించారు. “మీ నియామకాల విషయం నాకు ఎన్నికల ఫలితాలకన్నా ఎక్కువ టెన్షన్ కలిగిస్తుంది” అని స్పష్టం చేశారు.అంతేకాదు, కోచింగ్ సెంటర్ల కుట్రలపై అభ్యర్థులను కూడా అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో లక్షల రూపాయలు పెట్టి కేసులు వేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ మోడల్‌ను మనం సృష్టించాల్సిన అవసరం ఉందని, గుజరాత్ మోడల్‌ను అనుకరించాల్సిన అవసరం లేదని తెలిపారు.ఉద్యోగులు ప్రజాసేవలో తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి అని సీఎం సూచించారు. త్వరలో తల్లిదండ్రుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతం నుంచి 10 శాతం కోసి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. “మీ కళ్లల్లో కంటే మీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కనిపించాలని నేను కోరుకుంటున్నాను” అని రేవంత్ రెడ్డి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa