హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో యువకులు, ప్రజలు వివిధ రాజకీయ పార్టీలను వీడి తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. క్యూన్యూస్ రిపోర్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని క్యూన్యూస్ కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వయంగా హాజరై, కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి అధికారికంగా రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, "తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారం మరియు గళమెత్తని వర్గాలకు గళం వినిపించేందుకు రాజ్యాధికార పార్టీ బలమైన వేదికగా నిలుస్తుంది" అని తెలిపారు. అలాగే, 2028లో బీసీ ముఖ్యమంత్రిగా తన అవతరణ అనివార్యమని, ఆ దిశగా యువత, ప్రజలు భుజం తో భుజం కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.మల్లన్న మరింతగా మాట్లాడుతూ, "సిరిసిల్లలో యువత ముందడుగు వేసి పార్టీ పతాకాన్ని ఎగురవేయడం, తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశకు నాంది పలుకుతోంది. ప్రజల సమస్యల పరిష్కారం, సమాన హక్కులు, నిజమైన తెలంగాణ ఆత్మగౌరవం సాధించడం రాజ్యాధికార పార్టీ లక్ష్యం" అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత, ప్రజలు మల్లన్న నాయకత్వంలో ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa