శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాల సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రిథ్వీరాజ్ గారిని సన్మానించారు.పటాన్చెరులో శ్రీ మహంకాళి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లే, ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో, సాంస్కృతిక వైభవంతో సుసంపన్నంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు సేవా సమితి సభ్యులను శాలువాలతో సన్మానించి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలు మాత్రమే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలు. చిన్నారుల నుంచి యువత వరకు అందరూ పాల్గొని కూచిపూడి, సంగీతం, నృత్యాలతో ఈ వేడుకలను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ వేదిక సమాజంలో ఐక్యత, భక్తి, సాంస్కృతిక విలువలను పటిష్టం చేస్తోంది. ఈ పుణ్యకార్యానికి శ్రీ మహంకాళి సేవా సమితి గౌరవాధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ శ్రీ సఫాన్నదేవ్ గారు మరియు వారి అంకితభావంతో పనిచేస్తున్న బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అందించిన ఈ వారసత్వాన్ని తప్పకుండా కొనసాగిస్తూ, భవిష్యత్తు తరాలకు అందిస్తాం. అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ప్రకాశ్ రావు గారు, టప్ప కుమార్ గారు, ఎట్టయ్య గారు, ఫైర్ నరసింహారెడ్డి గారు, బుచ్చయ్య గారు, మల్కయ్య గారు, కృష్ణ గారు, సాయితేజ గారు, మహేష్ గారు తదితరులు సన్మానించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa