తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు మరోసారి బంద్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దసరా సెలవుల తర్వాత కాలేజీలు తెరవకుండా నిరసన తెలియజేయాలని యోచిస్తున్నాయి.
బకాయిలపై యాజమాన్యుల ఆవేదన:
కాలేజీల యాజమాన్యుల ప్రతినిధుల ప్రకారం, ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సమయానికి విడుదల చేయడం లేదని, దీని వల్ల వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిబ్బందికి జీతాలు, విద్యాసంస్థల నిర్వహణ ఖర్చులు మోయలేకపోతున్న పరిస్థితి నెలకొంది.
దసరా తర్వాత బంద్ నిర్ణయం:
ఈ నేపథ్యంలో 2025 అక్టోబర్ 6 నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించకుండా బంద్ కొనసాగించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు వారు అసోసియేషన్ స్థాయిలో సమావేశాలు జరిపి నిర్ణయం తీసుకుంటున్నారు. అధికారికంగా బంద్పై త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ స్పందనకోసం ఎదురుచూపు:
ఇక విద్యార్థుల భవిష్యత్పై ప్రభావం పడకుండా, ప్రభుత్వమే తొందరగా స్పందించి బకాయిలను విడుదల చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేకపోతే విద్యా వ్యవస్థలో అనేక అవాంతరాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa