ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం మొత్తం మీద నేరాల్లో మనమే ఫస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 05:22 PM

భారత్‌లో మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కేసులు నమోదైనట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. మహిళలపై నేరాల రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణలో ప్రతి లక్ష మంది మహిళలకు 124.9 నేరాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో రాజస్థాన్ (114.8), ఒడిశా (112.4), హర్యానా (110.3), కేరళ (86.1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ (66,381) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర (47,101), రాజస్థాన్ (45,450), పశ్చిమ బెంగాల్ (34,691), మధ్యప్రదేశ్ (32,342) రాష్ట్రాలు నిలిచాయి. నమోదైన కేసుల్లో అత్యధికంగా భర్త లేదా వారి బంధువుల క్రూరత్వానికి (ఐపీసీ సెక్షన్ 498ఏ) సంబంధించినవే ఉన్నాయి. ఇలాంటి కేసులు 1,33,676 నమోదు కాగా, కిడ్నాప్, అపహరణ కేసులు 88,605 ఉన్నాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో జరిగిన దాడులు 83,891 నమోదు కాగా, అత్యాచారం కేసులు 29,670గా ఉన్నాయి. వీటితో పాటు వరకట్న హత్యలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి కేసులు కూడా గణనీయ సంఖ్యలో నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa