ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీల ప్రతినిధులతో ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 07:39 PM

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ సహా పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.రానున్న ఉప ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నూతన సంస్కరణలతో నిర్వహించనున్నట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సంస్కరణలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే దేశవ్యాప్తంగా జరగనున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. అన్ని పార్టీలు సహకరించాలని, మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa