ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 11:11 AM

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట్ కు చెందిన కొమ్మాట ఎల్లం అనే వ్యక్తి మేడ్చల్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో జాతీయ రహదారిని దాటుతుండగా, హైదరాబాద్ నుంచి మేడ్చల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కిందపడిపోయిన ఎల్లం పైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa