తాడ్మనుర్ గ్రామానికి చెందిన పవన్ అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ వార్తతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను, కిడ్నాపర్ల కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు జరిపిన లోతైన విచారణలో, ఈ కిడ్నాప్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి బాలుడి తాత బాబురావు అని తేలింది. తన మనవడిని తన వద్ద ఉంచుకోవాలనే అతి ప్రేమతోనే ఆయన ఈ నాటకానికి తెర లేపినట్లు పోలీసులు గుర్తించారు. బాబురావు తన బీరాలు అయిన సునీల్, రవిలతో కలిసి పవన్ను కిడ్నాప్ చేయించినట్టుగా ఒప్పుకున్నారు. డబ్బు ఆశ లేదా ఇతర దురుద్దేశాలు ఏమీ లేవని, కేవలం మనవడిపై ఉన్న మమకారంతోనే ఈ పని చేసినట్లు ఆయన తెలిపారు.
చివరకు, కిడ్నాప్ అయిన బాలుడు పవన్ను క్షేమంగా రక్షించిన పోలీసులు, వెంటనే అతడి తల్లి పద్మకు అప్పగించారు. ఈ కిడ్నాప్లో పాల్గొన్న ప్రధాన నిందితుడు బాబురావుతో పాటు సునీల్, రవిలను పోలీసులు అరెస్టు చేశారు. బాబురావు మనవడిపై ప్రేమతో చేసిన ఈ చర్య చట్టరీత్యా నేరం కావడంతో, నిందితులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అసాధారణ కిడ్నాప్ ఉదంతం సంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa