ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయవంతం కావడంలో అనిల్ కామినేని పాత్ర,,,,బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 06:45 PM

ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (-2025) విజయవంతంగా ముగిసిన సందర్భంగా.. రామ్‌చరణ్, ఉపాసన ప్రధానిని కలిశారు. వీరితో పాటు ఉపాసన తండ్రి, రామ్‌చరణ్ మామ అనిల్ కామినేని , ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ కూడా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అనిల్ కామినేని గురించి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయనకు చాలా పవర్‌ఫుల్ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.


ఆర్చరీ కోసం ఆయన చాలా కృషి చేశారు..


కొండవిశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కామినేని తోడు అల్లుళ్లు. అనిల్ కామినేని గురించి ఎక్స్ వేదికగా విశ్వేశ్వర్ రెడ్డి పలు వివరాలు వెల్లడించారు. "ప్రధానమంత్రిని అనిల్ కామినేని కలిశారు. అయితే మీ అందరికీ రామ్ చరణ్, ఉపాసన గురించి తెలుసు. నా తోడు అల్లుడు అనిల్ స్వయంగా ఒక ఆర్చర్. ఆయన చాలా కాలంగా ఆర్చరీని ప్రోత్సహిస్తున్నారు. అవును, ఆయనే ఉపాసన తండ్రి.. అనిల్ కామినేని. ఆయన ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో వివిధ పదవుల్లో పని చేశారు. ఆయన కృషి, క్రెడిట్.. ఫలితంగానే భారత్ అనేక ఆర్చరీ పతకాలు గెలిచింది. ఇటీవల కెనడాలో బంగారు పతకం కూడా ఆయన కృషి ఫలితమే" అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.


"అనిల్ కామినేనికి సీనియర్ బీజేపీ నాయకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన 30 సంవత్సరాలకుపైగా దివంగత విజయ్ మల్హోత్రా వంటి సీనియర్ బీజేపీ నాయకులతో చాలా సన్నిహితంగా ఉన్నారు. అనిల్ కామినేనికి మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా బాగా తెలుసు. ఆర్చరీ రంగానికి ఆయన సహకారం అపారమైనది." అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాసుకొచ్చారు.


మరోవైపు.. భారత్‌లో తొలి ఆర్చరీ ఫ్రాంచైజీ టోర్నమెంట్‌ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగింది. అనిల్ కామినేని నేతృత్వంలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఈ లీగ్‌కు.. రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవరిస్తున్నారు. లీగ్ విజయవంతంగా పూర్తి అవడంతో ప్రధాని మోదీని కలిశారు. అనంతరం దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న చెర్రీ.. ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. మోదీ మార్గదర్శకత్వం, క్రీడల పట్ల మక్కువ ప్రపంచవ్యాప్తంగా ఆర్చరీ వారసత్వాన్ని కాపాడటానికి, ప్రోత్సహించడానికి తమకు సహాయపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అథ్లెట్స్‌కు రామ్‌చరణ్ అభిందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa