TG: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు (తనూష, సాయి ప్రియ, నందిని) మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ అమ్మాయిల తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను ఆయనకు MLA అందజేయగా.. తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ ఎల్లయ్య బోరున విలపించారు. 'ఈ డబ్బులు నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా' అంటూ గుండెలు బాదుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa