గురువారం సంగారెడ్డి మండలం ఇస్మాల్కంపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు, యువకులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను తెరవద్దని, ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే https://www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa