ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి వద్ద జరిగిన మావోయిస్టు నేత హెడ్మా ఎన్కౌంటర్ను సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండించింది. ఇది బూటకపు హత్య అని పార్టీ రాష్ట్ర నేత అవునూరి మధు ఆరోపించారు. పోలీసులు లొంగిపోయిన వ్యక్తిని కాల్చి చంపారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జరిగిన కుట్ర అని విమర్శించారు.
ఖమ్మం నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. మావోయిస్టు నేత హెడ్మా చిత్రపటానికి పూలమాలలు వేసి, నిమిషం మౌనం పాటించారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్లవ గీతాలు ఆలపించి హెడ్మా ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో న్యాయపరమైన విచారణ జరపాలని న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. దోషులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేసింది. ఇటువంటి దమనకాండలు విప్లవోద్యమాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు.
ఎన్కౌంటర్లతో ప్రజా ఉద్యమాలను, విప్లవ భావాలను అణచివేయడం అసాధ్యమని అవునూరి మధు హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం పోరాడే ఉద్యమం ఎప్పటికీ ఆగదని, ఇలాంటి హత్యలు కొత్త తరం విప్లవకారులను సృష్టిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa