రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్దపల్లె డివిజన్, సాయిబాబా నగర్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎన్. ధనుంజయతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa