తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ వైద్య విద్యా శాఖ బంపర్ నియామకాలకు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ తదితర పోస్టులకు గాను మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం డాక్టర్లకు, స్పెషలిస్టులకు గోల్డెన్ ఛాన్స్గా మారింది. నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తున్నందున ఆసక్తి ఉన్నవారు త్వరపడాల్సి ఉంది.
అర్హతల విషయానికొస్తే పోస్టును బట్టి విభిన్నంగా ఉన్నాయి. MBBSతో పాటు MD, MS, DNB, DM, M.Ch, PG డిప్లొమా, MSc, PhD వంటి ఉన్నత విద్యా అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఇది అద్భుతమైన అవకాశంగా నిలుస్తుంది.
జీతం విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎంట్రీ లెవెల్ పోస్టులకు నెలకు రూ.1 లక్ష నుంచి మొదలై, సీనియర్ స్థాయి పోస్టులకు రూ.1,90,000 వరకు జీతం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కాగా ఇతర భత్యాలు, ప్రమోషన్ అవకాశాలు కూడా బాగుంటాయి.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rajannasircilla.telangana.gov.in లోకి వెళ్లి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోండి.. మీ కెరీర్కు కొత్త రెక్కలు అద్దండి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa