హైదరాబాద్ మాదాపూర్ డివిజన్లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను చేపట్టిన హైడ్రా ప్రయత్నాలను అభినందిస్తూ స్థానిక ప్రజలు, విద్యార్థులు బుధవారం మానవహారం నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పలు కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa