ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు విత్తన బిల్లు ముసాయిదా పై ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహిస్తారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య సమన్వయంతో ఈ కార్యక్రమం జరగనుంది. రైతుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక చర్చ జరగబోతుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఈ సమావేశంలో విత్తన ఉత్పత్తి, పంపిణీ, నాణ్యత నియంత్రణకు సంబంధించిన అన్ని అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు. అలాగే ప్రముఖ విత్తన కంపెనీల డీలర్లు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. రైతుల సమస్యలు, సూచనలు నేరుగా అధికారుల ముందుంచే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
విత్తనాల నాణ్యత, ధరల నియంత్రణ, నకిలీ విత్తనాల అరికట్టడం, రైతులకు సకాలంలో మెరుగైన రకాలు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై లోతైన చర్చ జరగనుంది. గతంలో ఎదురైన సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రైతులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు రాబోయే యాసంగి సీజన్కు దిక్సూచిగా నిలుస్తాయన్న అంచనా ఉంది.
అందుకే ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని మండలాల రైతులు, వ్యవసాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రత్యేకంగా సూచించారు. తమ గొంతుకను వినిపించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన విత్తన సరఫరా వ్యవస్థ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa