తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిన ‘దీక్షా దివస్’ను పురస్కరించుకుని, పటాన్చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి గారి నాయకత్వంలో రామచంద్రపురం లక్ష్మీ గార్డెన్స్ నుండి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ నాయకుల తో బయదేరి ముందుగా పటాన్చేరు ఐ.బి బిల్డింగ్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రధాన ‘దిశా దివస్’ కార్యక్రమానికి తరలి వెళ్లారు.ఈ సందర్భంగా నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారు చేపట్టిన చారిత్రాత్మక నిరాహార దీక్షను స్మరించుకున్నారు. 2009 డిసెంబర్ 3న ప్రారంభమైన కేసీఆర్ గారి దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని తిరుగులేని దిశగా నడిపింది. ఆయన ఆరోగ్యం క్షీణించడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, పాఠశాలలు–కళాశాలలు–సంస్థల్లో జరిగిన నిరసనలు కేంద్రాన్ని కుదిపి, చివరకు తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని ప్రారంభించేలా చేశాయి. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఐక్యత, పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.బీఆర్ఎస్ పార్టీ ప్రతి సంవత్సరం ఈ రోజున ‘దీక్షా దివస్’ను నిర్వహించడం ద్వారా అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వాన్ని స్మరించుకుంటూ ప్రజల్లో స్వాభిమానం, ఉద్యమ స్ఫూర్తి కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కాట సునీత రాజేష్ గౌడ్ గారు, పటాన్చెరు నియోజికవర్గం బి ఆర్ ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు ఇతర పార్టీ పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు…
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa