కామారెడ్డి జిల్లాలో మూడు దశల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అన్ని దశలు పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, మూడవ దశ ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీ వరకూ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మొదటి, రెండవ దశల్లో ఎన్నికైన అభ్యర్థులు లేదా ఇతరులు దీనిని ఉల్లంఘించరాదని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa