ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రాష్ట్రవ్యాప్తంగా 'విజయ్ దివస్' నిర్వహించాలంటూ కేటీఆర్ పిలుపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:21 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన చారిత్రక దినమైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా 'విజయ్ దివస్' వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజును పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు.ఈ మేరకు ఆదివారం పార్టీ నాయకులతో సమావేశమైన కేటీఆర్, ప్రతి నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీ స్థాయిలో సంబరాలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9 ఒక మైలురాయి అని, ఆ రోజును ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa