ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు సహించం: బీసీ జేఏసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 10:34 AM

42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 31న హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా బీసీల రథయాత్ర, ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. బీసీల రాజకీయ చైతన్యంతో గ్రామస్థాయి ఎన్నికల్లో విజయం సాధించామని, రిజర్వేషన్ల అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa