ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంథనిలో మళ్ళీ పులి సంచారం.. ప్రజల్లో తీవ్ర ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 02:40 PM

మంథని మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం సాయంత్రం వెంకటాపూర్, ఆరెందా అడవి ప్రాంతంలో పులి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం ఆరెందా అటవీ ప్రాంతం నుండి మానేరు గుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గత మార్చిలో కూడా పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ప్రజలు, రైతులు, పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని, పులికి హాని కలిగించే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. పులి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa