హైదరాబాద్, డిసెంబర్ 28: మరికొద్ది రోజుల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభంకానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్-2026 జరుగనుంది.రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎగ్జిబిషన్ 85వ పారిశ్రామిక ప్రదర్శనగా నిర్వహించబడుతోందని తెలిపారు. సుమారు 1,050 ఎగ్జిబిటర్లు, 1,500 స్టాల్స్తో ఎంఎస్ఎంఈ, తయారీ, రిటైల్ రంగాల ప్రత్యేక ప్రదర్శనలు, అలాగే కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని మంత్రి చెప్పారు.ఈ సంవత్సరం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సందర్శకుల సౌలభ్యానికి మెట్రో కనెక్టివిటీ, ఉచిత పార్కింగ్, వీల్చైర్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత మంది సందర్శకులు రావచ్చని ఆయన అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa