తెలంగాణ హైకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల కోసం పిటిషన్ దాఖలైంది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. ఈ పిటిషన్పై హైకోర్టు ఈ నెల 27న విచారణ జరపనుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మిగతా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే వెలువడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa