ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరస్వతి శిశు మందిర్ లో సామూహిక అక్షరాభ్యాసం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 03:53 PM

వసంత పంచమి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 45 మంది చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. మాఘ శుద్ధ పంచమి రోజున సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారని, ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలపై దేవి ఆశీస్సులు ఉంటాయని సప్త శక్తి సంగం ప్రముఖ్ నాగలక్ష్మీ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa