అమెరికా-భారత్ మధ్య ఉద్రిక్తతల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్యనీతిపై ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ ప్రశంసలు కురిపించారు. భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాలని, ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడిలోనూ మోదీ ప్రదర్శిస్తున్న హుందాతనం, వ్యూహాత్మక సంయమనం ప్రపంచ వేదికపై ఆయన స్థాయిని పెంచాయని అన్నారు.బుధవారం మిల్బెన్ మాట్లాడుతూ.. "భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రదర్శిస్తున్న వివక్షాపూరిత ధోరణిని అమెరికాలోని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నిజమైన స్నేహం ఎప్పుడూ తప్పులను అంగీకరిస్తుంది" అని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ ఎంతో హుందాగా వ్యవహరించారని, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ప్రత్యామ్నాయాలను అన్వేషించారని కొనియాడారు. భారత్-ఈయూ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.గత 20 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులతో తనకు ఉన్న సంబంధాలను గుర్తుచేసుకుంటూ, తాను ఐదుగురు అధ్యక్షుల వద్ద ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. "ఒత్తిడిలోనూ మోదీ చూపిన హుందాతనం రాజకీయాల్లో ఆయన్ను అత్యంత గౌరవనీయమైన ప్రపంచ నాయకుడిగా నిలబెట్టింది" అని మిల్బెన్ అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa